జో అచ్యుతానన్ద జోజో ముకున్దా
రావె పరమానన్ద రామ గోవిన్దా ॥
అఙ్గజుని గన్న మా యన్న యిటు రారా
బఙ్గారు గిన్నెలో పాలు పోసేరా ।
దొఙ్గ నీవని సతులు గొఙ్కుచున్నారా
ముఙ్గిట నాడరా మోహనాకార ॥
గోవర్ధనమ్బెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి ।
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి ॥
నన్దు నిణ్టను జేరి నయము మీఱఙ్గ
చన్ద్రవదనలు నీకు సేవ చేయఙ్గ ।
నన్దముగ వారిణ్డ్ల నాడుచుణ్డఙ్గ
మన్దలకు దొఙ్గ మా ముద్దురఙ్గ ॥
పాలవారాశిలో పవళిఞ్చినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు ।
మేలుగా వసుదేవు కుదయిఞ్చినావు
బాలుడై యుణ్డి గోపాలుడైనావు ॥
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే ।
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొఙ్గ కొట్టుమన్నాడే ॥
గొల్లవారిణ్డ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుణ్డలను నేయి ।
చెల్లునా మగనాణ్డ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ॥
రేపల్లె సతులెల్ల గోపమ్బుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిణ్డ్ల లోను ।
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమన్దుమమ్మ ॥
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపిఞ్చి సతిపతులబట్టి ।
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాణ్డ్ర చేపట్టి మదనుడై నట్టి ॥
అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి ।
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెణ్డు ధరణి వ్రాల్చితివి ॥
హఙ్గుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృఙ్గార రచనగా చెప్పె నీ జోల ।
సఙ్గతిగ సకల సమ్పదల నీవేళ
మఙ్గళము తిరుపట్ల మదనగోపాల ॥